రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కావాల్సిందల్లా ప్రజల సహకారమేనని, కొద్ది రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లతో కలిసి ఆయన ప్రగతిభవన్లో విలేకరులతో మాట్లాడారు. సీఎం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే…




























